వరంగల్, మార్చి17(andhrapatrika): సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని బట్టల షాపులతోపాటు, పలు ప్రైవేట్ ఆఫీసులకు నిలయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ నిన్న సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడవలసి వచ్చింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రారంభమైన మంటలు భవనమంతటా వ్యాపించడంతో పాటు, ఐదవ అంతస్తులో పేలుడు సంభవించి మంటలు మరింత తీవ్రం అయ్యాయి. దీంతో అందులో చిక్కుకున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. అయితే సికింద్రాబాద్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. ఓరుగల్లు బిడ్డలను ఈ దుర్ఘటన చిదిమేసింది. హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన ఐదుగురు యువత కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి స్థానికంగా ఆవేదనకు గురిచేసింది. మహబూబాబాద్ మండలం సురేష్ నగర్ కు చెందిన 22సంవత్సరాల ప్రమీల, కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన 23సంవత్సరాల ప్రశాంత్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఖానాపూర్ తండాకు చెందిన 22ఏళ్ల బి శ్రావణి, నర్సంపేట మండలం మర్రిపల్లికి చెందిన 22ఏళ్ల వెన్నెల, నర్సంపేట కు చెందిన 22ఏళ్ల వి శివ మృతి చెందినట్టు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. వీరంతా దట్టమైన పొగ కారణంగా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాతికేళ్లలోపు వయసున్న యువతీ యువకులు అందరూ కాల్ సెంటర్ బిఎం 5 లో పనిచేస్తున్న వారిగా గుర్తించారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన వాళ్ళందరికీ మంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఆయా కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!